Wednesday, 30 July 2025

త్రివిక్రమ లాకెట్ మరియు ఉది మహిమ అపారం! - చేతన్‌సింగ్ సహారే, ఇండోర్

త్రివిక్రమ లాకెట్ మరియు ఉది మహిమ అపారం!  - చేతన్‌సింగ్ సహారే, ఇండోర్

ఒక శ్రద్ధావంతుడు, అకస్మాత్తుగా వచ్చిన కోరిక మేరకు, వివాహం చేసుకోబోతున్న తన మేనల్లుడి మెడలో త్రివిక్రమ్ లాకెట్ వేస్తాడు, ఆపై లాకెట్ మరియు ఊది ప్రభావంతో, బాపు భక్తుడు కాని మేనల్లుడు వివాహ వేడుక మధ్యలో తనకు ఎదురైన సంకటాల నుండి సులభంగా విముక్తి పొందుతాడు!

---------------------------

అంతా అశాస్త్రీయం!

హరి ఓం. 8 మే 2018న నాకు కలిగిన సద్గురు శ్రీ అనిరుద్ధ బాపు అనుభవాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను.

నా ఈ అనుభవం ద్వారా, బాపుకు మన పట్ల ఎంత శ్రద్ధ వహిస్తారో మరియు తను ప్రతి క్షణం తన భక్తులతో ఉండి భక్తులను మరియు వారి కుటుంబాలను రక్షిస్తారో అందరూ అర్థం చేసుకుంటారు.

నా మేనల్లుడి వివాహానికి హాజరు కావడానికి నా సోదరి, నేను మరియు నా కుటుంబం 6 మే 2018 న ఇండోర్ నుండి వార్ధాకు బయలుదేరాము. గమ్యస్థానానికి చేరుకోగానే, నేను నా మేనల్లుడిని కలిసిన తర్వాత, ఎలా ఉన్నావు? అని అడిగాను. ఇలా అడగడం వెనుక ఒక కారణం ఉంది. నా మేనల్లుడు బాగా మద్యం తాగేవాడు, కానీ గత రెండు రోజులుగా తను మద్యం తాగడం మానేశాడు. అందుకనే అతను కొంచెం బాగానే ఉన్నట్లు నాకు అనిపించింది.

వార్ధా చేరుకున్న రోజు నుండి, నా మేనల్లుడి గురించి ఆందోళన చెందుతున్నాను. నేను నిరంతరం అతని గురించి ఆలోచిస్తూనే ఉండేవాడిని. అతను బాపు భక్తుడు కాదు, కానీ మనం అతనికి త్రివిక్రమ్ లాకెట్ ధరింపజేయాలని నాకు పదే పదే అనిపించింది. నాకు తెలియకుండానే నేను నా మెడలోని త్రివిక్రమ లాకెట్‌ను తీసి నా మేనల్లుడి మెడలో వేశాను. నిజం చెప్పాలంటే నా లాకెట్‌ను నేను అతనికి ఎలా ఇచ్చానో కూడా నాకు తెలియదు! నాకు ఈ పని హృదయపూర్వకంగా చేయాలనిపించింది మరియు నేను అది చేశాను. పెళ్లి అయ్యే వరకు అతని మెడలోంచి ఈ లాకెట్ తీయవద్దని కూడా నా మేనల్లుడికి చెప్పాను. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, బాపు భక్తుడు కాకపోయినా, నా మేనల్లుడు దీన్ని అంగీకరించాడు. నాకు ఉపశమనం కలిగింది.

ఈ సంఘటన జరిగిన కొన్ని క్షణాల తర్వాత, ఒక వింత సంఘటన జరిగింది. నా మేనల్లుడికి ఏదో జరగడం ప్రారంభమైంది, కానీ మేము ఎవరు దానిని గుర్తించలేకపోయాము. నా మేనల్లుడు అకస్మాత్తుగా వణకడం ప్రారంభించాడు. నా భార్య మేనల్లుడికి శుభసూచకమైన మెహందీ పెడుతుంది, ఆ సమయంలో అతను మరింతగా వణకడం ప్రారంభించాడు. పెళ్లి కేవలం ఒక్క రోజు వ్యవధిలో ఉంది అనగా మరి ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఎవరికైతే పెళ్లి జరుగబోతుందో ఆ వ్యక్తి ఆరోగ్యమే మరింత క్షీణించసాగింది. ఏదో ఒక పరిష్కారం చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఇంట్లో పూజ కూడా జరుగుతోంది మరియు పెళ్లి రోజున మేనల్లుడికి ఆరోగ్య సమస్యలు ఉండకూడదు. అందుకే నేను వెంటనే అతనిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తీసుకెళ్లాను.

ఆసుపత్రిలోని వైద్యులు అతన్ని క్షుణ్ణంగా పరీక్షించారు. వైద్యులు అతన్ని పరీక్షిస్తుండగా, మేము అతని దగ్గర కూర్చుని హనుమాన్ చాలీసా పఠనం చేయసాగాము. బాపుతో ఒకే ఒక అభ్యర్థన చేసాము, బాపు, దయచేసి నా మేనల్లుడికి నయం చేయండి. రేపు అతని వివాహం ఉంది. అతన్ని క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాత డాక్టర్, అతనికి ఏమీ కాలేదు, అతను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు, కాబట్టి మీరు అతన్ని ఇంటికి తీసుకెళ్లవచ్చు అని అన్నారు.  మేము కొంచెం ఉపశమనం పొంది ఇంటికి తిరిగి వచ్చాము. కానీ మా మనసులో ఆందోళన పెరుగుతూనే ఉంది.  ఇప్పుడు అతను బాగానే ఉన్నాడని కూడా మాకు తెలిసింది. అయినప్పటికీ మా మనసులో ఆందోళన తగ్గలేదు.  నా మేనల్లుడికి ఏదైనా జరిగితే, త్రివిక్రమ్ లాకెట్ ఖచ్చితంగా అతన్ని కాపాడుతుందని ఒక వంతు నా మనసు నమ్మకంగా చెబుతోంది. అది నా కోసమే అయినా, నా మేనల్లుడు ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా మెడలో లాకెట్ ధరించాడు.

ఈ లాకెట్ ఎవరి మెడలో ఉంటుందో,  బాపు వారిని రక్షించడానికి సదా, సర్వదా సమర్థులు.

నా మేనల్లుడితో పాటు బాపు కూడా నిలబడి ఉన్నాడని నేను నమ్మాను.

మరుసటి రోజు పెళ్లి వేడుక ఎటువంటి ఆటంకం లేకుండా జరిగిపోయింది. ఇంటికి తిరిగి వెళ్ళే సమయం ఆసన్నమైంది మరియు నవవధువును పంపే సమయంలో, నా మేనల్లుడు అకస్మాత్తుగా కింద పడిపోయాడు మరియు నోటి నుండి నురగలు రావడం జరిగింది.  ఒకవైపు సంతోషకర వాతావరణం ఉంది, మరియు వివాహం చేసుకోబోయే వ్యక్తి స్పృహ కోల్పోయి పడి ఉన్నాడు మరియు నవవధువుతో సహ ఆమె కుటుంబ సభ్యులు నిలబడి ఉన్నారు. అందరికీ ఒకే ప్రశ్న ఉత్పన్నమైంది, అతనికి అకస్మాత్తుగా ఏమైంది? ఆనందమంతా మసకబారింది, ఎవరికీ ఏమీ తోచలేదు, ఏమి చేయాలో అర్థం కాలేదు. అందరూ భయపడి ఏడవడం ప్రారంభించారు మరియు ఇంటి సభ్యులందరూ వీలైనంత త్వరగా మేనల్లుడిని ఆసుపత్రికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.

నేను, నా భార్య బాపు భక్తులం కాబట్టి, మా బాపు ఈ సమస్యకు ఖచ్చితంగా తగిన పరిష్కారం కనుగొంటారని మాకు బాపుపై పూర్తి నమ్మకం ఉంది. నా భార్య తను తెచ్చుకున్న ఊదీ గుర్తుకు వచ్చింది. మేము ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు లేదా ఇంటి నుండి బయలుదేరేటప్పుడల్లా, ఊదీని మావెంట తీసుకెళ్తాము ధారణ కూడా చేసుకుంటాము. నా సోదరి కూడా బాపు భక్తురాలు కాబట్టి, ఆమె దగ్గర కూడా ఊదీ ఉండింది. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లే ముందు అతనికి ఊదీ ధారణ చేయడం మంచిదని భావించి, నా భార్య పరుగెత్తుకుంటూ ఊదీ పెట్టె తీసుకుని నా మేనల్లుడి దగ్గరకు వెళ్ళింది. మా ఇతర బంధువులందరు బాపు భక్తులు కారు, కాబట్టి వారందరూ చాలా భయపడ్డారు మరియు నా భార్య మాట వినలేదు మరియు ఆమెను పక్కకు వెళ్ళమని చెప్పారు. కానీ నా భార్య వారితో "ఇది మా సంస్థ యొక్క పవిత్రమైన ఊదీ” కాబట్టి నేను అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లే ముందు ఖచ్చితంగా దీన్ని ధరింపచేస్తాను అని గట్టిగా చెప్పింది. నా భార్య స్పృహ కోల్పోయిన నా మేనల్లుడికి ఊదీని రాసింది మరియు అది రాయగానే వెంటనే అతను ఉపశమనం పొంది స్పృహలోకి వచ్చాడు. నా మేనల్లుడు స్పృహలోకి వచ్చిన తరువాత, నా సోదరి ఊదీని నీటిలో కలిపి అతనికి ఆ ఊదీని కల్పిన నీళ్ళు కూడా ఇచ్చింది. దానిని తీసుకున్న వెంటనే, మేనల్లుడు పూర్తిగా కోలుకుని లేచి కూర్చున్నాడు. అతన్ని ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం కూడా రాలేదు. చికిత్స తర్వాత, అతను ఈ రోజు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు.

నా బాపు అలాంటివాడు. ఒక భక్తుడి పిలుపు మేరకు, అతను ఎక్కడికైనా, ఎప్పుడైనా, మరియు ఎలాగైనా పరిగెత్తుకు వస్తాడు. ఆ పిలుపు గురించి ఏమి చెప్పాలి, పిలవకపోయినా  బాపు మనకు సహాయం చేయడానికి వస్తాడు. బాపు సర్వదా మాతోనే ఉంటాడు, కాబట్టి బాపు ఇండోర్ మరియు వార్ధాలో నాతోనే ఉన్నాడు. మేనల్లుడి మెడలో త్రివిక్రమ లాకెట్ నా ద్వారా వేయబడింది, అది కూడా బాపుకు నా మీద, అతని మీద ఉన్న అపారమైన కరుణ వల్లే. ఆ త్రివిక్రమ్ లాకెట్ మరియు ఊదీ మేనల్లుడిని రక్షించాయని నేను నమ్మకంగా చెబుతున్నాను. తద్వారా తదుపరి సంఘటన తప్పింది. అతను బాపును నమ్మేవాడు కాదు, అయినప్పటికీ బాపు అతనిని రక్షించారు. అతను బాపు భక్తుడు కాకపోవచ్చు, కానీ నా సోదరి (అతని తల్లి) బాపు ఉపాసనకు వెళుతుంది మరియు ఇంట్లో కూడా బాపు యొక్క నిత్య ఉపాసన మరియు పఠనం చేస్తుంది. ఇప్పుడు ఆమె కోడలు కూడా సద్గురు బాపు ఆరాధనలో చేరి బాపు భక్తిలో స్థిరపడింది.

“హరి ఓం”   “శ్రీరామ్”  “అంబజ్ఞ”  “నాథసంవిద్”



ગુજરાતી>> ಕನ್ನಡ>> বাংলা>> தமிழ்>>

Tuesday, 29 July 2025

వైదిక గణపతి

వైదిక గణపతి - వైదిక గణపతి - సద్గురు శ్రీ అనిరుద్ధ బాపు గారి దినపత్రిక ప్రత్యక్షలో సంపాదకీయం (15-12-2006)

వైదిక గణపతి - సద్గురు శ్రీ అనిరుద్ధ బాపు గారి దినపత్రిక ప్రత్యక్షలో సంపాదకీయం (15-12-2006)

 

"ఋగ్వేదంలోని 'బ్రహ్మణస్పతి-సూక్తం' మరియు అథర్వవేదంలోని 'గణపతి-అథర్వశీర్షం'  పేరుతో పిలువబడే ఒక ఉపనిషత్తు - ఈ రెండు పరిపూర్ణ ఆధారాలతో శ్రీ గణేశుని వైదిక ప్రమాణం నిరూపించబడుతుంది.

ఋగ్వేదంలోని మూల మంత్రం క్రింది విధంగా ఉంది -

ఓం గణానాం త్వాం గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమమ్‌‍|

జ్యేష్ఠరాజం బ్రహ్మణామ్ బ్రహ్మణస్పత ఆ నః శృణ్వన్నూతిభిః సీద సాదనమ్‌‍||

ఋగ్వేదం 2/23/1

భావార్థం: సముదాయాలకు ప్రభువైన నీవు గణపతి, జ్ఞానులందరిలో నీవు శ్రేష్ఠుడు, కీర్తివంతులందరిలో నీవు అత్యున్నతుడు మరియు నీవే సర్వాధికారులకు అధిపతి. నిన్ను మేము అత్యంత ఆదరంతో ఆహ్వానిస్తున్నాము, నీవు నీ సర్వశక్తులతో వచ్చి ఈ ఆసనంపై (మూలాధార చక్రంలో) విరాజిల్లు. (మూలాధార చక్రం యొక్క ఆసనంపై నీ అధికారం మాత్రమే చెల్లుబాటు కావాలి.)

శ్రీ బ్రహ్మణస్పతి పూజ సమయంలో సద్గురు శ్రీ అనిరుధ్ధ పాపు.
శ్రీ బ్రహ్మణస్పతి పూజ సమయంలో సద్గురు శ్రీ అనిరుధ్ధ బాపు.

బ్రహ్మణస్పతి వైదిక దేవత యొక్క ఒక పేరు గణపతి, అంటే గణపతి యొక్క మరొక పేరు బ్రహ్మణస్పతి. వైదిక కాలంలో ప్రతి శుభకార్యం బ్రహ్మణస్పతి ఆవాహనతోనే ప్రారంభమయ్యేది మరియు నేటికీ అదే మంత్రంతో గణపతిని ఆహ్వానించి పవిత్ర కార్యాలను ప్రారంభిస్తారు. ఎలాగైతే ఋగ్వేదంలోని బ్రహ్మణస్పతి జ్ఞానదాత మరియు శ్రేష్ఠ జ్ఞానియో, గణపతి కూడా జ్ఞానదాత మరియు బుద్ధిదాత దైవం. బ్రహ్మణస్పతి చేతిలోని స్వర్ణ గొడ్డలి నేటికీ గణపతి చేతిలో ఉంది. భారతదేశ ప్రాచీన చరిత్రలో 'సమన్వయం' ప్రధాన సూత్రంగా ఉన్నందున, అనేక దేవతలు ఆధ్యాత్మిక స్థాయిలో ఏకమయ్యారు. 'వేదాలలోని ప్రతిదీ బ్రహ్మమే' అనే తత్వంతో మరియు 'ఏకం సత్ విప్రా బహుధా వదంతి' (ఆ మూల ఉనికి (పరమేశ్వరుడు) ఒకటే; జ్ఞానులు దానిని అనేక పేర్లతో తెలుసుకుంటారు లేదా ఆహ్వానిస్తారు) అనే భావనతో, అనేక విగ్రహాలు మరియు అనేక రూపాలు ఉన్నప్పటికీ, భారతీయ సంస్కృతిలో వివిధ శాఖల ఆరాధనీయ దేవతల ఏకత్వాన్ని ఆచరణాత్మక స్థాయిలో నిరూపించడంలో ఎప్పుడూ ఇబ్బంది రాలేదు. 

భారతీయ సంస్కృతి యొక్క లోకమానసంలో పరమాత్మ యొక్క వివిధ రూపాల వెనుక ఉన్న ఏకత్వం, అనగా కేశవత్వం యొక్క జ్ఞానం ఎంత బలంగా మరియు లోతుగా పాతుకుపోయిందంటే, సామాన్య విద్యావంతులకు లేదా నిరక్షరాస్యులైన సమాజానికి కూడా 'గణపతి ఆర్యదేవుడా, వైదిక దేవుడా, చిన్న చిన్న తెగల దేవుడా లేక వేదాలలో అస్తిత్వం లేని మరియు పురాణాల నుండి ఉద్భవించిన దేవుడా' వంటి వివాదాలకు ఎలాంటి అర్థం ఉండదు. ఈ వివాదాలు కేవలం కొందరు నిజాయితీగల చరిత్రకారులకు లేదా తథాకథిత  నాస్తిక బుద్ధిజీవుల కోసం మాత్రమే. నిజమైన మరియు నిజాయితీగల చరిత్ర పరిశోధకులు తమ దైవత సంబంధిత పరిశోధనను కేవలం సంస్కృతి చరిత్రకు మార్గదర్శక స్తంభాలుగా మాత్రమే ఉపయోగిస్తారు, అయితే కుత్సిత బుద్ధితో అలాంటి పరిశోధన చేసేవారు సమాజంలో చీలికలు సృష్టించడానికి అలాంటి పరిశోధనలను ఉపయోగించుకుంటారు, ఏ మార్గంలో అయినా మరియు ఎవరైనా దైవత సంబంధిత పరిశోధన చేసినా లేదా తమ సొంత అభిప్రాయం ప్రకారం దైవత సంబంధిత ఆలోచనలు వ్యక్తం చేసినా, ఆ దైవత ఆధ్యాత్మిక ఉనికికి ఎప్పుడూ ప్రమాదం వాటిల్లదు.

సద్గురు శ్రీ అనిరుధ్ధ పాపు బ్రహ్మణస్పతికి దుర్వాకూర్చెతో అర్చన చేస్తూ ఉన్నారు.
సద్గురు శ్రీ అనిరుధ్ధ బాపు బ్రహ్మణస్పతిని దుర్వాంకురాలతో అర్చన చేస్తూ ఉన్నారు.

గణపతిని ఎవరి దేవుడిగా నిర్ణయించినా, 'విశ్వం యొక్క ఘనప్రాణం' అనే గణపతి యొక్క మూల స్వరూపం మారదు లేదా ఎన్నటికీ కనుమరుగు కాదు, ఎందుకంటే గణపతి ఏ పరిశోధకుల పరిశోధనల ద్వారా నిరూపితమై ప్రసిద్ధి చెందలేదు; గణపతి అనే దైవం భక్తి మరియు జ్ఞానాల సమన్వయాన్ని సాధించిన ఋషుల చింతన ద్వారా తన మూల రూపంలో వ్యక్తమైంది, భక్తుల హృదయాలలో ప్రేమతో స్థిరపడింది మరియు ఆరాధకుడు మరియు ఆరాధనీయుల పరస్పర ప్రేమ వల్ల ప్రసిద్ధి చెందింది. కాబట్టి, ఋగ్వేదంలోని బ్రహ్మణస్పతి వేరే ఎవరో మరియు గణపతి అని పిలువబడ్డాడు అనే తర్కంతో భక్తుల హృదయానికి ఎలాంటి సంబంధం లేదు. శివ పార్వతి పుత్రుడు ఈ గణపతి, అందుకే అన్ని ఆరాధకులకు మరియు పంతుల శుభకార్యాలలో ప్రథమ గౌరవ స్థానాన్ని పొందుతాడు. శైవ, దేవీ-ఆరాధకులు, వైష్ణవ, సూర్యోపాసకులు వంటి వివిధ సంప్రదాయాలలో కూడా గణపతి ఒక అందమైన వారధిని నిర్మిస్తాడు.

అథర్వవేదంలో శ్రీ గణపతి-అథర్వశీర్షం అనే శ్లోకం చాలా సుస్పష్టమైన పదాల్లో ఇప్పటికీ ప్రచలితమైన మరియు అందరితో గుర్తింపు పొందిన గణపతి స్వరూపాన్ని, ఆయుధాలను మరియు స్వభావ విశేషాలను వివరించుతొంది.  ఈ అథర్వశీర్షంలోని గణపతి రూపం ద్వారా స్పష్టంగా 'నీవు రుద్ర, విష్ణు, అగ్ని, ఇంద్ర, చంద్ర, సూర్య, వరుణ - అన్నీ నీవే' అని స్పష్టంగా ఉచ్చరించబడింది. అలాంటప్పుడు, ఈ అన్ని రూపాల చారిత్రక సందర్భాలను గణపతి యొక్క చారిత్రక సందర్భాలతో పోల్చి చూడటం వల్ల ఏమి ప్రయోజనం? అలాంటి పరిశోధనలు ఖాళీగా ఉన్నవారి నిరర్థక మరియు డొల్ల మాటలు, మరియు అవి సంస్కృతి సంరక్షణకు ఏమాత్రం ఉపయోగపడవు.

బ్రహ్మణస్పతి విగ్రహానికి అభిషేకం జరుగుతోంది.
బ్రహ్మణస్పతి విగ్రహానికి అభిషేకం జరుగుతోంది.



జ్ఞానమార్గంలో శ్రేష్ఠులు, వివాదరహితులైన సంతశ్రేష్ఠులు శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్, జ్ఞానేశ్వరి ప్రారంభంలోనే -

ఓం నమో జీ ఆద్యా. వేద ప్రతిపాద్యా.

జై జై స్వసంవేద్యా. ఆత్మరూపా||

దేవా తూచి గణేషు. సకలార్థమతిప్రకాశు.

మ్హనే నివృత్తిదాసు. అవధారిజో జీ||

(భావార్థం: ఓ ఆద్య దేవా మీకు నమస్కారం వేదాల ద్వారా ప్రతిపాదితుడవు జయహో జయహో స్వతంత్రంగా బోధించబడినవాడవు, ఆత్మస్వరూపుడవు. ఓ దేవా! నీవే గణేశుడవు, సకలార్థలావిషయమైన బుద్దిని ప్రసాదించేవాడవు. అని నివృత్తి దాసుడు ప్రాణమించుచున్నాడు - అక్షధారిణివి నీవే స్వామీ !)

పాపు మార్గదర్శనం ప్రకారం ప్రతి సంవత్సరం జరిగే శ్రీ మాఘీ వినాయకోత్సవంలో సమూహ అధర్వశీర్ష పఠనం.
బాపూజీ మార్గదర్శనంలో  ప్రతి సంవత్సరం నిర్వహించబడే  శ్రీ మాఘీ గణేశోత్సవంలో, సామూహిక  శ్రీ గణపతి అథర్వశీర్ష పఠనం

అని శ్రీ మహా గణపతి గురించి స్పష్టంగా వ్రాసి ఉంచారు. గణపతి మరియు బ్రహ్మణస్పతి ఒకరు కాదని మరియు వేదాలలో గణపతి యొక్క ప్రతిపాదన లేదని భావిస్తే, శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్ యొక్క ఈ వచనం దానికి బలంగా వ్యతిరేకంగా నిలుస్తుంది. చరిత్ర అధ్యయనం మరియు పరిశోధన ఎన్ని సాధనాల ద్వారా చేసినా, కాలం యొక్క ప్రచండ శక్తివంతమైన ప్రవాహంలో అందుబాటులో ఉన్న సాధనాలు మరియు సూచనల కంటే వేల రెట్లు ఎక్కువ విషయాలు కనుమరుగై ఉంటాయి, కాబట్టి ముఖ్యంగా సాంస్కృతిక చరిత్రను పరిశోధించేటప్పుడు ఎవరూ తమ అభిప్రాయాన్ని ఏకైక సత్యంగా సమర్పించలేరు. సజీవ సంస్కృతి యొక్క ఒక ప్రధాన లక్షణం దాని ప్రవాహ గుణం, అంటే సంస్కృతి యొక్క ప్రయాణం, ఇది అక్షరాలా లక్షల కారణాల వల్ల సంభవించిన మార్పులు. ఈ మార్పుల నుండి పూర్తిగా మరియు నిశ్చలంగా మిగిలిపోయేది పూర్తి సత్యమే, మరియు సత్యం అంటే కేవలం నిజమైన వాస్తవం కాదు, సత్యం అంటే పవిత్రతను సృష్టించే వాస్తవం మరియు అలాంటి పవిత్ర వాస్తవం నుండి ఆనందం ఉద్భవిస్తుంది మరియు అందుకే భక్తుల హృదయం అటువంటి 'సత్యం'తో సంబంధం కలిగి ఉంటుంది, కేవలం కాగితం మరియు ఆధారాల ముక్కలతో కాదు.

బ్రహ్మణస్పతి-సూక్తం మరియు అథర్వశీర్షం గణపతి యొక్క వైదిక స్వరూపాన్ని నిరూపిస్తాయో లేదో అనేదానితో నాకు ఏమాత్రం సంబంధం లేదు, ఎందుకంటే వేల సంవత్సరాలుగా మానవ సమాజం యొక్క భక్తమానసంలో దృఢంగా స్థిరపడి, నివసించిన ప్రతి రూపం ఆ ఓంకారానిదే, అంటే ప్రణవానిదే, అంటే కేశవునిదే అనే విషయంలో నాకు ఎప్పుడూ సందేహం కలగలేదు, కలగడం లేదు మరియు కలగదు, ఎందుకంటే కేశవుడు అంటే 'శవం' లేదా ఆకృతికి అతీతంగా ఉన్న చైతన్యం యొక్క మూల ఆధారం. దాని ఉనికిని ప్రపంచం మొత్తం తిరస్కరించినా అది ఎన్నటికీ నాశనం కావడం అసాధ్యం."

సంపాదకీయం చివరలో సద్గురు శ్రీ అనిరుద్ధ బాపు ఇలా వ్రాశారు -

"మిత్రులారా, అందుకే అనవసరమైన అనంతమైన చర్చలు చేస్తూ కూర్చోవడం కంటే, సంపూర్ణ శ్రద్ధ మరియు విశ్వాసంతో పరమాత్మను ఆరాధించండి,  మీ కార్యాన్ని సిద్ధింపజేయడానికి శ్రీ సమర్థులు."
భగవాన్ శ్రీ బ్రహ్మణస్పతికి పుష్పాలు అర్పిస్తున్న సద్గురు శ్రీ అనిరుధ్ధ బాపు.
मराठी >> हिंदी >> English >> ગુજરાતી>> ಕನ್ನಡ>> বাংলা>> தமிழ்>>
మంగళమూర్తి

మంగళమూర్తి

భాగ్-1

మంగళమూర్తి మోరియా

మంగళమూర్తి మోరియా

భాగ్-2

మోద-క

మోద-క

భాగ్-3

వైదిక గణపతి

వైదిక గణపతి

భాగ్-4

శ్రీమహాగణపతి - దైవతవిజ్ఞానము

శ్రీమహాగణపతి - దైవతవిజ్ఞానము

భాగ్-5

Monday, 28 July 2025

అనిరుద్ధ బాపు కోట్స్ - 01- అధ్యయనం

ఒక పట్టా పత్రము మిమ్మల్ని విషయానికి సంకీర్ణము చేయదు, అధ్యయనం మిమ్మల్ని విషయంతో అనుసంధానము చేస్తుంది. - సద్గురు అనిరుద్ధ బాపు
ఒక పట్టా పత్రము మిమ్మల్ని విషయానికి సంకీర్ణము చేయదు, అధ్యయనం మిమ్మల్ని విషయంతో అనుసంధానము చేస్తుంది.
- సద్గురు అనిరుద్ధ బాపు

 
 
సద్గురు అనిరుద్ధ బాపు గారి సత్య విద్యపై ప్రేరణాత్మక సూక్తి – ఎలా అధ్యయనం మనను జ్ఞానంతో అనుసంధానిస్తుంది, కేవలం డిగ్రీతో కాదు.
అనిరుద్ధ బాపు కోట్స్, అనిరుద్ధ బాపు సూక్తులు, సద్గురు అనిరుద్ధ బాపు, ప్రేరణాత్మక సూక్తులు


Friday, 25 July 2025

మోద-క

సద్గురు  అనిరుద్ధ బాపు దృష్టికోణం లో - గణేష్ భక్తి - భాగ్ - 3 - మోద-క
సద్గురు శ్రీ అనిరుద్ధ బాపు గారి దినపత్రిక 'ప్రత్యక్షం' లోని సంపాదకీయం (06-09-2006)

శ్రీ గణపతిని స్మరించుకోగానే ప్రతీ భక్తుడికి లేదా నాస్తికుడికి కూడా వెంటనే గుర్తొచ్చేది మోదకాలే. ఈ రోజుల్లో ఖోవాతో చేసిన మోదకాలు దొరుకుతున్నాయి, కానీ మనకు ఇష్టమైన మవ్వా (కోవా) మోదకాలు అందుబాటులో లేనప్పుడు తక్కువ నాణ్యత కలిగిన మోదకాలతో సంతుష్టిగాఉండాల్సి వస్తుంది. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నేను అత్యంత ఇష్టంగా తిన్న మోదకాలు అంటే సాంప్రదాయ పద్ధతిలో చేసినవే. అందులో బియ్యప్పిండిని వెన్నతో ముద్దలా కలిపుతారు, ఆ ముద్దలో వేసే పూరణాన్ని, తాజా మరియు రుచికరమైన తురిమిన కొబ్బరిని, ఇంట్లో తయారు చేసిన నెయ్యిలో వేపి తయరు చేస్తారు. అంతకంటే ముఖ్యంగా, మోదకం తినేటప్పుడు దాన్ని విరిచి, అందులో ఇంకో చెంచా స్వచ్ఛమైన నెయ్యి వేసుకోవాలి. పిల్లలందరికీ ఈ ‘నెయ్యితో నిండిన’ మోదకం అంటే చాలా ఇష్టం. ఈ సాంప్రదాయ మోదకం ఆహారంలోని సౌమ్య, స్నిగ్ధ మరియు గురు గుణాలకు సర్వోత్తమైనది. అందుకే మూలాధార చక్రాన్ని, అంటే అత్యుష్ణ, అర్ధస్నిగ్ధ మరియు లఘు స్థానాన్ని నియంత్రించే శ్రీ మహాగణపతికి ఇది సర్వోత్తమ నైవేద్యం.

సద్గురు శ్రీ అనిరుద్ధ బాపు ఇంటికి గణపతి ఆగమనం.

 నేటి పరిస్థితుల వల్ల, ప్రతి ఒక్కరికీ ఇలాంటి మోదకాలు చేయడం సాధ్యం కాకపోవచ్చు. కానీ, వీలైన వారు ఇలాంటి సాంప్రదాయ మోదకాలను చేసి, దాన్ని అత్యంత ప్రేమతో శ్రీ మహాగణపతికి అర్పించాలి. గరిక మరియు శమీ పత్రాలతో చేసే బాహ్యోపచారం మరియు సాంప్రదాయ మోదకాల నైవేద్యం నిజంగా ఉగ్ర, రూక్ష మరియు లఘు గుణాలను నాశనం చేసి, సౌమ్యత్వం, స్నిగ్ధత్వం మరియు గురుత్వం (స్థిరత్వం) స్థాపన చేస్తాయి. దానివల్ల, ఆ మంగళమూర్తి వరద వినాయకుడు విఘ్నాలను నాశనం చేయడానికి ప్రతి ఒక్కరి ప్రాణమయ దేహంలో మరియు మనోమయ దేహంలో అవతరిస్తాడు.

మోదకం అనగానే నాకు ఓ పాత కథ గుర్తొస్తుంది. ఒక చక్రవర్తి ఉండేవాడు. అతను చాలా విలాసవంతుడు మరియు ఎలాంటి విద్యనూ అభ్యసించలేదు. అందుకే అతని తండ్రి అతనికి పట్టాభిషేకం చేసేటప్పుడు, ఆ విద్యాహీనుడైన రాజకుమారుడికి ఎంతో విద్వాంసురాలు మరియు సుజ్ఞాని అయిన రాజకుమారితో వివాహం జరిపించాడు. అలా ఆ చదువురాని రాజు, అతని విద్వాంసురాలైన, పతివ్రత అయిన రాణి, తమ రాజపరివారంతో కలిసి ఒక సరస్సులో జలక్రీడల కోసం వెళ్లారు. అక్కడ సరస్సులో ఆడుకుంటున్నప్పుడు, రాజు రాణి మీద చేత్తో నీళ్లు చల్లడం మొదలుపెట్టాడు. పెళ్లి వరకు సంస్కృతాన్నే తన విద్యాభాషగా మరియు వాడుక భాషగా కలిగిన ఆ రాణి వెంటనే, “మోదకైః సించ” అంది. తక్షణమే రాజు సేవకుడిని పిలిచి, అతని చెవిలో ఏదో చెప్పాడు. కొద్దిసేపట్లోనే, ఆ సేవకుడు మోదకాలతో నిండిన ఐదారు పాత్రలను అక్కడికి తెచ్చాడు. రాజు ఒకదాని తర్వాత ఒకటిగా మోదకాలను రాణి మీదకు గురిపెట్టి విసరడం ప్రారంభించాడు. ఈ విచిత్రమైన సంఘటనతో మొదట పూర్తిగా అయోమయానికి గురైన రాణి, కొద్దిసేపటికే తేరుకుని, ఇతర రాజస్త్రీలు మరియు మంత్రుల ముఖాల్లోని ఎగతాళి నవ్వును చూసి చాలా సిగ్గుపడి, దుఃఖించింది. ఎందుకంటే రాణి చెప్పాలనుకున్నది, “మా ఉదకైః సించ” – అంటే, ‘నన్ను నీళ్లతో తడపవద్దు’. కానీ, కేవలం మాట్లాడటానికి మాత్రమే సంస్కృతం తెలిసిన ఆ చదువురాని రాజుకు సంస్కృత వ్యాకరణ నియమాలు తెలియకపోవడం వల్ల, ‘మోదకైః’ అనే పదాన్ని విడదీయకుండా తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత కథ వేరే మలుపు తీసుకుంటుంది, కానీ నాకైతే రాణి మీద మోదకాల వర్షం కురిపించిన ఆ మూర్ఖపు రాజే ఈ రోజుల్లో అనేక రూపాల్లో అక్కడక్కడా తిరుగుతున్నట్లు కనిపిస్తాడు.


మోదక నైవేద్యం సమర్పయామి (మోదకాలను నైవేద్యంగా సమర్పించుచున్నాను)
సద్గురు శ్రీ అనిరుద్ధ బాపు ఇంట్లో ప్రతి సంవత్సరం జరిగే గణేష్ ఉత్సవంలో, గణపతి బాప్పాకు మోదకాలు ప్రేమగా నైవేద్యంగా సమర్పించబడతాయి.

గణపతికి మోదకాలు, గరిక ఇష్టమని వాటిని ఆదరంగా అర్పించడం సబబే. అలాగే, ఆ పరమాత్ముడికి ఎన్నో రూపాలున్నాయని రకరకాల విగ్రహాలు చేయడం కూడా సరైనదే. కానీ, ఆ గణపతికి పాలు తాగించడానికి అక్కడక్కడా క్యూలు కట్టడం అంటే ఆ రాజు చేసిన పనిని మళ్లీ చేయడమే. నాకో విషయం అర్థం కాదు, నిజానికి గణపతికి మోదకాలు అత్యంత ప్రియమైనప్పుడు, ఆయనెందుకు అన్నిచోట్లా పాలు తాగుతాడు? మోదకాలు ఎందుకు తినడు? అన్నింటికన్నా ముఖ్యంగా, ఈ ప్రశ్న మనలో ఎవరికీ రాదు. ఆ మంగళమూర్తి అయిన పరమాత్మ భక్తులు ప్రేమతో అర్పించిన చల్లారిన రొట్టె ముక్కలను కూడా ప్రేమగా స్వీకరిస్తాడు, ఇందులో నాకు ఎలాంటి సందేహం లేదు. విగ్రహం ముందున్న నైవేద్యం పళ్లెంలోని ఒక్క మెతుకు కూడా తగ్గకపోయినా ఫర్వాలేదు. గీతలో సాక్షాత్తు భగవాన్ శ్రీకృష్ణుడే స్వయంగా ఈ హామీని భక్తులందరికీ ఇచ్చాడు. ముఖ్యంగా, పరమాత్ముడికి ఇలాంటివి చేసి తన గొప్పతనాన్ని పెంచుకోవాల్సిన అవసరం లేదు, అలాగే ప్రజలలో భక్తిని పెంచడానికి కూడా ఆయనకు ఇలాంటి ఉపాయాలు అవసరం లేదు. భక్తులు, అభక్తులు అనే తేడా లేకుండా ప్రతి వ్యక్తి యొక్క సమగ్ర జీవన స్థితిని పూర్తిగా తెలిసిన, ప్రతి ఒక్కరి కర్మఫలాన్ని నిర్ణయించే ఆ నిజమైన పరమాత్ముడికి ఇలాంటి విచిత్రమైన పనుల అవసరం ఎప్పటికీ ఉండదు.

సంపాదకీయాన్ని ముగిస్తూ సద్గురు శ్రీ అనిరుద్ధ బాపు ఇలా రాశారు -

 ‘మిత్రులారా, ఆ పరమాత్ముడికి కావలసింది మీ అచంచలమైన శ్రద్ధ, భక్తి మరియు కృతజ్ఞతా భావంతో చేసే భగవంతుని సేవ, ఆయన నిస్సహాయులైన పిల్లల సేవ. ఇదే నిజమైన నైవేద్యం, కాదు, ఇదే సర్వశ్రేష్ఠమైన నైవేద్యం. ఈ నైవేద్యాన్ని ఆ పరమాత్మ పూర్తిగా స్వీకరించి, దానికి వెయ్యి రెట్ల ఫలాన్ని ప్రసాదంగా భక్తుడికి ఇస్తాడు. మోదకాలను నైవేద్యంగా తప్పకుండా అర్పించండి, ఇష్టంగా మీరూ తినండి. కానీ, ‘మోద్’ అంటే ‘ఆనందం’ అని మర్చిపోవద్దు. పరమాత్ముడికి, ఇతరులకు ఆనందం కలిగేలా ప్రవర్తించడమే సర్వశ్రేష్ఠమైన మోదకం.’


मराठी >> हिंदी >> English >> ગુજરાતી>> ಕನ್ನಡ>> বাংলা>> தமிழ்>>
మంగళమూర్తి

మంగళమూర్తి

భాగ్-1

మంగళమూర్తి మోరియా

మంగళమూర్తి మోరియా

భాగ్-2

మోద-క

మోద-క

భాగ్-3

వైదిక గణపతి

వైదిక గణపతి

భాగ్-4

శ్రీమహాగణపతి - దైవతవిజ్ఞానము

శ్రీమహాగణపతి - దైవతవిజ్ఞానము

భాగ్-5

Wednesday, 23 July 2025

మంగళమూర్తి మోరియా!

 

మంగళమూర్తి మోరియా!   -   సద్గురు శ్రీ అనిరుద్ధ బాపు గారి దైనిక్ ప్రత్యక్ష పత్రికలో సంపాదకీయం (15-09-2007)

మా చిన్నతనం నుండి మా ఇంట్లో వాతావరణం పూర్తిగా శుద్ధ వైదిక సంస్కారాలతో నిండి ఉండేది. కానీ, శౌచం -  అశౌచం, కుల-మత భేదాలు, కర్మఠ కర్మకాండలు అనే వాటి ఛాయ కూడా ఉండేది కాదు. మా అమ్మమ్మ, నాయనమ్మలకు సంస్కృత వాఙ్మయంపై అపారమైన పట్టు ఉండేది, అన్ని సంహితలు వారికి కంఠస్థంగా ఉండేవి. అందుకే వేద మంత్రాల శుద్ధమైన, లయబద్ధమైన ఉచ్చారణలు ఎప్పుడూ చెవుల్లో వినిపించేవి. ఈనాటికీ వారిద్దరి గొంతుల్లోంచి వినిపించే వైదిక మంత్రాలు, సూక్తాల మధుర స్వరాలు నా అంతరంగంలో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. గణపతి హారతి తర్వాత చెప్పే మంత్రపుష్పాంజలి, ఈ కాలపు ‘షార్ట్‌కట్’ లాగా ‘ఓం యజ్ఞేన యజ్ఞమయజంత....’ అని కాకుండా, ‘ఓం గణాణాం త్వా గణపతిం హవామహే....’ అని మొదలై దాదాపు అరగంట నుండి ముప్పావుగంట సేపు జరిగేది. అందులో ఆరోహణ, అవరోహణ, ఆఘాత, ఉద్ధార మొదలైన అన్ని నియమాలను పాటించినప్పటికీ, ఆ మంత్రపుష్పాంజలిలో మాధుర్యం, కోమలత్వం మరియు సహజత్వం అలాగే సజీవంగా ఉండేవి. ఎందుకంటే, ఆ మంత్రోచ్చారణలో తమ గొప్పతనాన్ని ప్రదర్శించాలనే కోరిక ఉండేది కాదు, కేవలం సంపూర్ణ భక్తిరసంతో నిండిన ప్రఫుల్లమైన అంతఃకరణం ఉండేది.

తరువాత, నా ఐదో ఏట, మా అమ్మమ్మగారింట్లో అంటే పండితుల ఇంట్లో గణపతి ముందు, వారిద్దరూ నాకు మంత్రపుష్పాంజలి యొక్క శాస్త్రీయ పద్ధతిని మొదటిసారి నేర్పించారు. ఆ సమయంలో మా అమ్మ ముగ్గురు చిన్నమ్మలు, అమ్మమ్మ, నాయనమ్మ ఇలా ఐదుగురు కలిసి నాకు హారతి ఇచ్చి, బోలెడన్ని మోదకాలు తినిపించారు. అప్పటికి నేను మా అమ్మమ్మగారింట్లో ఏకైక మనవడిని, అందుకే పాధ్యే మరియు పండిత్ కుటుంబాలందరికీ అత్యంత ప్రియమైన వాడిని. అదే రోజు అమ్మమ్మ పాధ్యే కుటుంబ సంప్రదాయం ప్రకారం బాలగణేశుడిని ప్రతిష్టాపన చేసే పద్ధతిని కూడా నాకు వివరించారు. అందుకే ఈనాటికీ మా ఇంట్లో గణేశ చతుర్థికి ప్రతిష్టాపన చేసే విగ్రహం బాలగణేశుడిదే ఉంటుంది.

నేను ఒకసారి అమ్మమ్మను అడిగాను, ‘ప్రతి సంవత్సరం బాలగణేశుడినే ఎందుకు?’  అమ్మమ్మ నా బుగ్గపై చేయి నిమిరి ఇలా సమాధానం ఇచ్చారు, “అరే బాపురాయా, పసిబాలుడు  ఇంటికి వచ్చాడు, వచ్చాడు, అతనిని మనం అల్లారుముద్దుగా చూసుకుంటే, ఆ బాలుడు వెంటే అతని తల్లిదండ్రులు కూడా వచ్చి సంతోషిస్తారు. ఈ బాలగణేశుడిని భక్తులు చేసిన లాలన పాలనల వల్ల పార్వతి మాత, పరమశివులకి కూడా తనంతట తానే స్వాగతం, పూజ జరుగుతుంది. రెండో విషయం ఏమిటంటే, తెలియని సాధారణ మనిషి కూడా ముద్దులొలికే చిన్న పిల్లలతో వ్యవహరించేటప్పుడు మనసులో తనంతట తానే నిష్కామ ప్రేమ వ్యక్తమవుతుంది. మరి ఈ అత్యంత చూడముచ్చటైన మంగళమూర్తి బాలరూపం సాన్నిధ్యంలో భక్తుల మనసుల్లో భక్తి ప్రేమతో పాటు నిష్కామంగా, పవిత్రంగా ఉంటుంది కదా?”

అమ్మమ్మగారి ఈ భావనలు ఒక అత్యంత శుద్ధమైన, పవిత్రమైన భక్తిమయ అంతఃకరణం యొక్క రసమయ సహజ ప్రవృత్తులు. మనమందరం అక్షరాల కోట్ల మంది గణపతిని ఇంట్లో ప్రతిష్ఠిస్తాం, కొందరు ఒకటిన్నర రోజులు, మరికొందరు పది రోజులు. రకరకాల గణేశ విగ్రహాలు ఉండవచ్చు, కానీ ఈ విఘ్ననాశకుడైన గణేశుడితో మనం ఇలాంటి ఆప్యాయత, సాన్నిహిత్యం, కుటుంబ సంబంధాన్ని ఏర్పరచుకుంటామా?

ఇంటికి వచ్చిన గణపతి కేవలం ఇంటి సంప్రదాయం దెబ్బతినకూడదు, దెబ్బతింటే విఘ్నాలు వస్తాయి అనే భావనతోనే కొన్ని చోట్ల తీసుకురాబడతాడు. కొన్ని చోట్ల మొక్కుబడి తీర్చుకోవడానికి తీసుకురాబడతాడు, మరికొన్ని చోట్ల కేవలం పండుగ మరియు వినోదం కోసం తీసుకురాబడతాడు. అలాంటి గణపతి ప్రతిష్టాపనలో మంత్రాలు ఉంటాయి, మంత్రపుష్పాంజలి ఉంటుంది, హారతి ఉంటుంది, మహానైవేద్యం ఉంటుంది మరియు రీతిరివాజులు, శాస్త్రాలను పూర్తిగా పాటించాలనే భయంతో కూడిన ఆత్రుత కూడా ఉంటుంది. కానీ ఈ గందరగోళంలో కోల్పోయేది ఏమిటంటే, ఈ ఆరాధనలోని మూల సారం అంటే ప్రేమపూరిత భక్తిభావం.

మంగళమూర్తి మోరియా మరియు సుఖకర్త దుఃఖహర్త, ఈ శ్రీ గణపతి బిరుదులు అందరికీ తెలిసినవే. నిజానికి, ఈ ‘సుఖకర్త దుఃఖహర్త’ బిరుదుల వల్లనే కదా మనం గణపతిని ఇంటికి తీసుకురావడానికి సిద్ధమవుతాం. కానీ ‘మంగళమూర్తి’ అనే బిరుదు సంగతి ఏమిటి? ఆ సిద్ధివినాయకుడు అంతా మంగళం చేస్తాడు, కానీ అతన్ని ఇంటికి తెచ్చిన తర్వాత మనం అతన్ని ఎంతవరకు మంగళకరమైన వాతావరణంలో ఉంచుతాం? ఇదే ముఖ్యమైన ప్రశ్న.

కేవలం దూర్వా యొక్క పెద్ద దండలు వేసి, ఇరవై ఒక్క మోదకాలు ఉదయం సాయంత్రం అతని ముందు ఉంచి, ఎర్రని పూలు సమర్పించి, హారతులకు తాళాలు కొట్టి మనం మన స్థాయికి తగ్గట్టుగా మరియు మన సామర్థ్యం ప్రకారం మంగళాన్ని సృష్టిస్తున్నామా? సమాధానం చాలా వరకు ‘లేదు’ అనే వస్తుంది.

మరి ఆ మంగళమూర్తికి మన నుండి ఆశించే ‘మాంగల్యం’ మనం అతనికి ఎలా అర్పించగలం? సమాధానం చాలా సులభం. ఆ విగ్రహాన్ని స్వాగతించేటప్పుడు, ఒక సంవత్సరం తర్వాత మన ఆప్తుడు ఇంటికి తిరిగి వస్తున్నాడు అనే భావనను ఉంచుకోండి; ఇరవై ఒక్క మోదకాలతో పాటు నైవేద్యంతో నిండిన పళ్ళాన్ని అతని ముందు ఉంచి, లాలనగా ఆఫర్ చేయండి. వచ్చిన అతిథులను ఆహ్వానించే హడావిడి కంటే, ఆ గణేశుడి ఆరాధనపై ఎక్కువ శ్రద్ధ వహించండి. హారతి చెప్పేటప్పుడు ఎవరితోనూ పోటీ పడకండి. మరియు ముఖ్యంగా, ఈ మహావిఘ్నేశ్వరుడు తన స్థానానికి తిరిగి వెళ్ళడానికి బయలుదేరినప్పుడు, మీ హృదయం ఉప్పొంగిపోనివ్వండి మరియు హక్కుతో కూడిన ప్రేమపూర్వక విన్నపం చేయండి, ‘మంగళమూర్తి మోరియా, వచ్చే సంవత్సరం త్వరగా రండి.’

సంపాదకీయ ముగింపులో సద్గురు శ్రీ అనిరుద్ధ బాపు ఇలా వ్రాస్తారు –

‘నా శ్రద్ధావంతులైన మిత్రులారా, ‘వచ్చే సంవత్సరం త్వరగా రండి’ అనే ఈ వాక్యం యొక్క అర్థాన్ని సరిగ్గా అర్థం చేసుకోండి. వచ్చే తేదీ నిర్ణయించబడి ఉంటుంది కదా, మరి కేవలం నోటితో ‘త్వరగా రండి’ అనడంలో ఇంకేమైనా అర్థం ఉందా? ఇందులో ఒకటే అర్థం ఉంది, అదేమిటంటే వచ్చే సంవత్సరం కోసం ఎదురు చూడకండి, దేవా మోరియా, మీరు ప్రతిరోజూ వస్తూ ఉండండి మరియు అది వీలైనంత త్వరగా జరగనివ్వండి.’

मराठी >> हिंदी >> English>> ગુજરાતી>> ಕನ್ನಡ>> বাংলা>> தமிழ்>>
మంగళమూర్తి

మంగళమూర్తి

భాగ్-1

మంగళమూర్తి మోరియా

మంగళమూర్తి మోరియా

భాగ్-2

మోద-క

మోద-క

భాగ్-3

వైదిక గణపతి

వైదిక గణపతి

భాగ్-4

శ్రీమహాగణపతి - దైవతవిజ్ఞానము

శ్రీమహాగణపతి - దైవతవిజ్ఞానము

భాగ్-5

Friday, 18 July 2025

అనిరుద్ధ బాపు వివరించిన శ్రీ గణేష్ భక్తి, శ్రద్ధ మరియు విజ్ఞాన యాత్ర

 

అనిరుద్ధ బాపు వివరించిన శ్రీ గణేష్ భక్తి, శ్రద్ధ మరియు విజ్ఞాన యాత్ర
అనిరుద్ధ బాపు వివరించిన శ్రీ గణేష్ భక్తి, శ్రద్ధ మరియు విజ్ఞాన యాత్ర

 

మనం ఏ శుభకార్యం మొదలుపెట్టినా, అది ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవ్వాలని మనం విఘ్నహర్త శ్రీ గణేశుడిని స్మరిస్తాం, పూజిస్తాం మరియు ప్రార్థిస్తాం. చిన్నప్పుడు అక్షరాలు దిద్దడం నేర్చుకునేటప్పుడు కూడా, మనం ముందుగా 'శ్రీ గణేశాయ నమః' అనే నేర్చుకుంటాం. ఎన్ని రకాల దేవతల ఆలయాలు ఉన్నా, శ్రీ గణేశుడు మాత్రం ప్రతి ఆలయ గర్భగుడి ప్రవేశ ద్వారం వద్ద కొలువై ఉంటాడు. ‘మంగళమూర్తి శ్రీ గణపతి’ నిజంగానే అన్ని శుభకార్యాలకు అగ్రస్థానంలో ఉండే, మన భారతదేశం అంతటా చిన్నల నుండి పెద్దల వరకు అందరికీ ప్రియమైన దైవం.

ఇదే గణపతి గురించి, 'ప్రత్యక్ష' దినపత్రిక యొక్క కార్యనిర్వాహక సంపాదకులు డా. శ్రీ. అనిరుద్ధ ధైర్యధర్ జోషి (సద్గురు శ్రీ అనిరుద్ధ బాపు) తమ అధ్యయనం మరియు చింతన నుండి వచ్చిన ఆలోచనలను అనేక సంపాదకీయాలలో వివరించారు. ఈ సంపాదకీయాలు కేవలం సమాచారానికే పరిమితం కాకుండా, భక్తుల మనసులోని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేవిగా, భక్తికి మరింత అర్థాన్నిచ్చేవిగా మరియు గణపతి యొక్క వివిధ రూపాలను లోతుగా పరిచయం చేసేవిగా ఉన్నాయి.
ఈ సంపాదకీయాలలో బాపు వేదాలు, పురాణాలు, సంతుల వాంగ్మయం నుండి గణపతి స్వరూపాన్ని మరియు దాని వెనుక ఉన్న తత్త్వజ్ఞానాన్ని చాలా సులభమైన, సరళమైన భాషలో వివరించారు. బ్రహ్మణస్పతి-గణపతి సంకల్పన, విశ్వానికి ఘనప్రాణమైన గణపతి, గణపతి జన్మకథ వెనుక ఉన్న సిద్ధాంతం, సార్వజనిక గణేశోత్సవం వెనుక ఉన్న పాత్ర, మూలాధారచక్రానికి అధిష్ఠాత గణపతి, గణపతి యొక్క ప్రధాన నామాలు, ఆయన వాహనం మూషికరాజు, వ్రతబంధ కథ, మోదక కథ మరియు ఆ కథల భావార్థం... ఈ అన్ని విషయాలను బాపు అలా రచించారు, అంటే అవి మన మనసులోని ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నట్లుగా ఉన్నాయి.
గణపతి అనే దైవానికి సంబంధించిన ఈ వివరణ శ్రద్ధగల భక్తులకు కేవలం సమాచారం కాదు, భావనాత్మక దృక్పథంతో వారి శ్రద్ధను మరింత దృఢపరుస్తుంది.
'ప్రత్యక్ష' దినపత్రికలో వివిధ సమయాల్లో ప్రచురించబడిన ఈ సంపాదకీయాలు — బాపు ఇచ్చిన ఆ అమూల్య ఆలోచనల పరిమళం మనసుల్లో వ్యాపించాలనే ఏకైక ఉద్దేశ్యంతో ఇప్పుడు బ్లాగుపోస్ట్ (blogpost) రూపంలో మనందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. 

Monday, 14 July 2025

ఘోరకష్టోద్ధరణ స్తోత్ర పఠనం | Ghorkashtoddharan Stotra Pathan


 


శ్రావణ మాసం శ్రవణభక్తికి సంబంధించిన మాసం, ఈ మాసంలో ఎక్కువగా శ్రవణం, పఠనం, పూజ చేయాలని సద్గురు శ్రీ అనిరుద్ధ బాపూ శ్రద్ధావంతులకు చెప్పారు.  బాపూ గారు తన ప్రవచనాల ద్వారా, సంపాదకీయాల ద్వారా ఎన్నోసార్లు నామస్మరణ, మంత్ర-స్తోత్రజపం, ఆధ్యాత్మిక గ్రంథపఠనం మరియు సామూహిక ఉపాసన యొక్క ప్రాముఖ్యతను వివరించారు.   

బాపూ 28 జూలై 2011న తన మ‌రాఠీ ప్రవచనంలో 'శ్రావణ మాసంలో ఘోరకష్టోద్ధరణ స్తోత్ర పఠనం యొక్క ప్రాముఖ్యత' గురించి చెప్పారు.  బాపూ గారు చెప్పినదాని సారాంశం ఇలా ఉంది: 

 

"సద్గురుతత్త్వం ఎంత ప్రేమ చూపుతుందో అంత ఎవరూ చేయరు మరియు చేయలేరు కూడా. ప్రతి ఒక్కరి పరిమితులు ఎంత పెరిగినా, అది పరిమితిగానే ఉంటుంది. కానీ ఏకైక పరమేశ్వరుడు మాత్రమే అమితమైనవాడు.  సద్గురుతత్త్వం ఎక్కడా విఘటించదు, అది నిర్గుణమైనది, నిరాకారమైనది, అయితే పూర్తిగా చైతన్యమయమైనదిగా ఉంటుంది.  ఘోరకష్టోద్ధరణ స్తోత్రం సాక్షాత్ శ్రీగురు దత్తాత్రేయ వారి స్తోత్రం మరియు దాన్ని రచించిన వారు సాక్షాత్ శ్రీ వాసుదేవానంద సరస్వతీ - స్వామీమహారాజ్.  ఈ స్తోత్రం కూడా ఐదు శ్లోకాలతో ఉంది, చాలా సులభంగా 108 సార్లు పఠించవచ్చు.  ప్రభావవంతమైన స్తోత్రాన్ని మనం శ్రావణ మాసంలో పఠిస్తాము." 

 

దీని ద్వారా మనకు అర్థం అవుతుంది అంటే ఈ స్తోత్రాన్ని ప్రతిరోజూ పఠించాలి మరియు పవిత్రమైన శ్రావణ మాసంలో దీనిని 108 సార్లు సామూహికంగా పఠించాలని బాపూ గారు ప్రత్యేకంగా చెప్పారు, ఇది ప్రతి భక్తునికి అనేక రెట్లు ఫలితాన్నిస్తుంది. 

 

సద్గురువారి మార్గదర్శనంలో భక్తులు భారీ సంఖ్యలో మొత్తం నెలంతా సామూహిక స్తోత్ర పఠనంలో హృదయపూర్వకంగా పాల్గొంటారు.  బాపూ గారు సత్యప్రవేశంలో 'యజ్ఞేన-దానేన-తపసా' గురించి చెప్పారు. 

దాననుసారంగా స్తోత్ర పఠనంతో పాటు భక్తులు అన్నపూర్ణ ప్రసాదం పథకానికి ధాన్యం మొదలైన వస్తువులను స్వచ్ఛందంగా అర్పిస్తారు.  ఈ సంవత్సరం పఠన సమయంలో అన్నపూర్ణ మహాప్రసాదం పథకానికి విరాళం ఇవ్వదలచిన శ్రద్ధావంతులు క్రింది లింక్‌పై క్లిక్ చేసి విరాళం ఇవ్వవచ్చు. 

 

ఘోరకష్టోద్ధరణ స్తోత్రం గురించి ఒక కథ చెబుతారు: శక 1833, అంటే 1911లో, మహాన్ యతివర్యులు శ్రీవాసుదేవానంద సరస్వతీ - స్వామీమహారాజ్ యొక్క ఇరవై ఒకటవ చాతుర్మాస్య కురుగడ్డిలో జరిగింది. 

ఆ సమయంలో, స్వామీజీని దర్శించడానికి వచ్చిన ఒక భక్తుడు, స్వామీజీపై గాఢమైన భక్తి కలిగి ఉండి, సంతానాన్ని మరియు ఋణ విమోచనాన్ని కోరుతూ ప్రార్థించాడు.  స్వామీజీ కృపతో అతనికి ఒక కుమారుడు మరియు ఒక కుమార్తె పుట్టారు మరియు అతని రుణం కూడా తీరింది. 

 

"భక్తుల మనోభీష్టాలు నెరవేరాలని మరియు కలియుగంలో భక్తులు ఎదుర్కొనే కష్టాలు తొలగిపోవాలని, శాశ్వత మంగళం కలగాలని; మా కష్టాలు ఎలా తొలగిపోయాయో, మేము ఎలా సుఖంగా మారామో మరియు మరింత భక్తిమంతులమయ్యామో, అలానే భక్తుల కష్టాలను తొలగించేందుకు ఒక స్తోత్రాన్ని రచిస్తే అది అందరికీ లాభపడుతుంది" అని ఆ భక్తుడు స్వామీజీని ప్రార్థించాడు.  కరుణాహృదయులైన శ్రీ వాసుదేవానంద సరస్వతీ - స్వామీమహారాజ్ లుప్రార్థనను అంగీకరించి ఈ ఘోరకష్టోద్ధరణ స్తోత్రాన్ని రచించారు. 

 

ధన్యుడు ఆ భక్తుడు మరియు ధన్యులు శ్రీ మహారాజ్. పవిత్ర దత్తక్షేత్ర నృసింహవాడిలో ఈ స్తోత్రం నిత్యం పఠించబడుతుంది. 

 

ఘోరకష్టోద్ధరణ స్తోత్రం యొక్క సామూహిక పఠనం ప్రతి సంవత్సరం సంస్థ ద్వారా శ్రావణ మాసంలో నిర్వహించబడుతుంది.  గురువారం తప్ప మిగతా రోజులలో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు మరియు సాయంత్రం 5:30 నుండి రాత్రి 9:00 వరకు పఠనం జరుగుతుంది.  గురువారం ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు మరియు మధ్యాహ్నం 4:00 నుండి సాయంత్రం 7:00 వరకు పఠనం జరుగుతుంది.  శ్రద్ధావంతు సౌకర్యార్థం ఒక రోజు ఆన్‌లైన్ లో కూడా పఠనాన్ని ఏర్పాటు చేస్తారు. 

 

ఈ స్తోత్రం చివరి శ్లోకంలో చెప్పిన ప్రకారం, ఈ స్తోత్ర పఠన వల్ల సద్ధర్మప్రేమ, సద్బుద్ధి, భగవద్భక్తి మరియు సత్సంగం లభిస్తాయి.  మానవుడి లోకిక మరియు ఆధ్యాత్మిక కోరికలు నెరవేరుతాయి.  భగవంతుని పట్ల ప్రేమ మరియు ఆకర్షణ పెరుగుతుంది.  పరమానంద స్వరూప శ్రీగురు దత్తాత్రేయునికి నమస్కారం చేస్తూ, "ఘోరమైన కష్టాల నుండి మా విమోచనం చేయండి" అనే ఆర్తన ఈ స్తోత్రంలో ఉంది. 

 

ఈ స్తోత్రంలో ఇలా చెప్పబడింది: "శ్లోకపంచకమేతద్యో లోకమంగళవర్ధనం ప్రపఠేన్నియతో భక్త్యాశ్రీదత్తప్రియో భవేత్"  ఇది సృష్టికి మంగళాన్ని తీసుకొస్తుందని మనం గ్రహించవచ్చు.  "ఈ స్తోత్రాన్ని దృఢ విశ్వాసంతో పఠించే భక్తుడు శ్రీగురు దత్తాత్రేయునికి ప్రియుడవుతాడు" అని శ్రీ వాసుదేవానంద సరస్వతీ చెప్పారు. 

"శ్రీగురువుకు ప్రియుడవడం" – అది భక్తునికి అత్ర్యున్నతమైన విషయం. 

 

శ్రద్ధావంతుల లోకిక కష్టాలను తొలగించే, కోరికలను నెరవేర్చే మరియు ఆధ్యాత్మిక అభివృద్ధిని కలిగించే ఈ ప్రభావవంతమైన దత్త స్తోత్రాన్ని పఠించే అవకాశం సద్గురు శ్రీ అనిరుద్ధ గారిచే లభించింది. 

 

భక్తికి తోడు సేవకు అనేక మార్గాలను అందించిన బాపూ గారు AADM (అనిరుద్ధాస్ అకాడమీ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్) ను ఈ ఘోరకష్టోద్ధరణ స్తోత్రానికి ప్రాయోగిక (ప్రాక్టికల్) రూపంగా స్థాపించారు.