ఘోరకష్టోద్ధరణ స్తోత్ర పఠనం | Ghorkashtoddharan Stotra Pathan


 


శ్రావణ మాసం శ్రవణభక్తికి సంబంధించిన మాసం, ఈ మాసంలో ఎక్కువగా శ్రవణం, పఠనం, పూజ చేయాలని సద్గురు శ్రీ అనిరుద్ధ బాపూ శ్రద్ధావంతులకు చెప్పారు.  బాపూ గారు తన ప్రవచనాల ద్వారా, సంపాదకీయాల ద్వారా ఎన్నోసార్లు నామస్మరణ, మంత్ర-స్తోత్రజపం, ఆధ్యాత్మిక గ్రంథపఠనం మరియు సామూహిక ఉపాసన యొక్క ప్రాముఖ్యతను వివరించారు.   

బాపూ 28 జూలై 2011న తన మ‌రాఠీ ప్రవచనంలో 'శ్రావణ మాసంలో ఘోరకష్టోద్ధరణ స్తోత్ర పఠనం యొక్క ప్రాముఖ్యత' గురించి చెప్పారు.  బాపూ గారు చెప్పినదాని సారాంశం ఇలా ఉంది: 

 

"సద్గురుతత్త్వం ఎంత ప్రేమ చూపుతుందో అంత ఎవరూ చేయరు మరియు చేయలేరు కూడా. ప్రతి ఒక్కరి పరిమితులు ఎంత పెరిగినా, అది పరిమితిగానే ఉంటుంది. కానీ ఏకైక పరమేశ్వరుడు మాత్రమే అమితమైనవాడు.  సద్గురుతత్త్వం ఎక్కడా విఘటించదు, అది నిర్గుణమైనది, నిరాకారమైనది, అయితే పూర్తిగా చైతన్యమయమైనదిగా ఉంటుంది.  ఘోరకష్టోద్ధరణ స్తోత్రం సాక్షాత్ శ్రీగురు దత్తాత్రేయ వారి స్తోత్రం మరియు దాన్ని రచించిన వారు సాక్షాత్ శ్రీ వాసుదేవానంద సరస్వతీ - స్వామీమహారాజ్.  ఈ స్తోత్రం కూడా ఐదు శ్లోకాలతో ఉంది, చాలా సులభంగా 108 సార్లు పఠించవచ్చు.  ప్రభావవంతమైన స్తోత్రాన్ని మనం శ్రావణ మాసంలో పఠిస్తాము." 

 

దీని ద్వారా మనకు అర్థం అవుతుంది అంటే ఈ స్తోత్రాన్ని ప్రతిరోజూ పఠించాలి మరియు పవిత్రమైన శ్రావణ మాసంలో దీనిని 108 సార్లు సామూహికంగా పఠించాలని బాపూ గారు ప్రత్యేకంగా చెప్పారు, ఇది ప్రతి భక్తునికి అనేక రెట్లు ఫలితాన్నిస్తుంది. 

 

సద్గురువారి మార్గదర్శనంలో భక్తులు భారీ సంఖ్యలో మొత్తం నెలంతా సామూహిక స్తోత్ర పఠనంలో హృదయపూర్వకంగా పాల్గొంటారు.  బాపూ గారు సత్యప్రవేశంలో 'యజ్ఞేన-దానేన-తపసా' గురించి చెప్పారు. 

దాననుసారంగా స్తోత్ర పఠనంతో పాటు భక్తులు అన్నపూర్ణ ప్రసాదం పథకానికి ధాన్యం మొదలైన వస్తువులను స్వచ్ఛందంగా అర్పిస్తారు.  ఈ సంవత్సరం పఠన సమయంలో అన్నపూర్ణ మహాప్రసాదం పథకానికి విరాళం ఇవ్వదలచిన శ్రద్ధావంతులు క్రింది లింక్‌పై క్లిక్ చేసి విరాళం ఇవ్వవచ్చు. 

 

ఘోరకష్టోద్ధరణ స్తోత్రం గురించి ఒక కథ చెబుతారు: శక 1833, అంటే 1911లో, మహాన్ యతివర్యులు శ్రీవాసుదేవానంద సరస్వతీ - స్వామీమహారాజ్ యొక్క ఇరవై ఒకటవ చాతుర్మాస్య కురుగడ్డిలో జరిగింది. 

ఆ సమయంలో, స్వామీజీని దర్శించడానికి వచ్చిన ఒక భక్తుడు, స్వామీజీపై గాఢమైన భక్తి కలిగి ఉండి, సంతానాన్ని మరియు ఋణ విమోచనాన్ని కోరుతూ ప్రార్థించాడు.  స్వామీజీ కృపతో అతనికి ఒక కుమారుడు మరియు ఒక కుమార్తె పుట్టారు మరియు అతని రుణం కూడా తీరింది. 

 

"భక్తుల మనోభీష్టాలు నెరవేరాలని మరియు కలియుగంలో భక్తులు ఎదుర్కొనే కష్టాలు తొలగిపోవాలని, శాశ్వత మంగళం కలగాలని; మా కష్టాలు ఎలా తొలగిపోయాయో, మేము ఎలా సుఖంగా మారామో మరియు మరింత భక్తిమంతులమయ్యామో, అలానే భక్తుల కష్టాలను తొలగించేందుకు ఒక స్తోత్రాన్ని రచిస్తే అది అందరికీ లాభపడుతుంది" అని ఆ భక్తుడు స్వామీజీని ప్రార్థించాడు.  కరుణాహృదయులైన శ్రీ వాసుదేవానంద సరస్వతీ - స్వామీమహారాజ్ లుప్రార్థనను అంగీకరించి ఈ ఘోరకష్టోద్ధరణ స్తోత్రాన్ని రచించారు. 

 

ధన్యుడు ఆ భక్తుడు మరియు ధన్యులు శ్రీ మహారాజ్. పవిత్ర దత్తక్షేత్ర నృసింహవాడిలో ఈ స్తోత్రం నిత్యం పఠించబడుతుంది. 

 

ఘోరకష్టోద్ధరణ స్తోత్రం యొక్క సామూహిక పఠనం ప్రతి సంవత్సరం సంస్థ ద్వారా శ్రావణ మాసంలో నిర్వహించబడుతుంది.  గురువారం తప్ప మిగతా రోజులలో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు మరియు సాయంత్రం 5:30 నుండి రాత్రి 9:00 వరకు పఠనం జరుగుతుంది.  గురువారం ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు మరియు మధ్యాహ్నం 4:00 నుండి సాయంత్రం 7:00 వరకు పఠనం జరుగుతుంది.  శ్రద్ధావంతు సౌకర్యార్థం ఒక రోజు ఆన్‌లైన్ లో కూడా పఠనాన్ని ఏర్పాటు చేస్తారు. 

 

ఈ స్తోత్రం చివరి శ్లోకంలో చెప్పిన ప్రకారం, ఈ స్తోత్ర పఠన వల్ల సద్ధర్మప్రేమ, సద్బుద్ధి, భగవద్భక్తి మరియు సత్సంగం లభిస్తాయి.  మానవుడి లోకిక మరియు ఆధ్యాత్మిక కోరికలు నెరవేరుతాయి.  భగవంతుని పట్ల ప్రేమ మరియు ఆకర్షణ పెరుగుతుంది.  పరమానంద స్వరూప శ్రీగురు దత్తాత్రేయునికి నమస్కారం చేస్తూ, "ఘోరమైన కష్టాల నుండి మా విమోచనం చేయండి" అనే ఆర్తన ఈ స్తోత్రంలో ఉంది. 

 

ఈ స్తోత్రంలో ఇలా చెప్పబడింది: "శ్లోకపంచకమేతద్యో లోకమంగళవర్ధనం ప్రపఠేన్నియతో భక్త్యాశ్రీదత్తప్రియో భవేత్"  ఇది సృష్టికి మంగళాన్ని తీసుకొస్తుందని మనం గ్రహించవచ్చు.  "ఈ స్తోత్రాన్ని దృఢ విశ్వాసంతో పఠించే భక్తుడు శ్రీగురు దత్తాత్రేయునికి ప్రియుడవుతాడు" అని శ్రీ వాసుదేవానంద సరస్వతీ చెప్పారు. 

"శ్రీగురువుకు ప్రియుడవడం" – అది భక్తునికి అత్ర్యున్నతమైన విషయం. 

 

శ్రద్ధావంతుల లోకిక కష్టాలను తొలగించే, కోరికలను నెరవేర్చే మరియు ఆధ్యాత్మిక అభివృద్ధిని కలిగించే ఈ ప్రభావవంతమైన దత్త స్తోత్రాన్ని పఠించే అవకాశం సద్గురు శ్రీ అనిరుద్ధ గారిచే లభించింది. 

 

భక్తికి తోడు సేవకు అనేక మార్గాలను అందించిన బాపూ గారు AADM (అనిరుద్ధాస్ అకాడమీ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్) ను ఈ ఘోరకష్టోద్ధరణ స్తోత్రానికి ప్రాయోగిక (ప్రాక్టికల్) రూపంగా స్థాపించారు. 

 

 

Comments