సద్గురు శ్రీ అనిరుద్ద!
హరి ఓం శ్రీరామ్ అంబజ్ఞ. నేను శ్వేతవీరా కాసేకర్, ములుండ్ (తూర్పు) ఉపాసనా కేంద్రం. నేను ఎగ్జిమ్ బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తున్నాను.
2002 సంవత్సరంలో బి.కామ్. చివరి సంవత్సరం చదువుతున్నప్పుడు నేను మొదటిసారిగా బాపుగారి దర్శనం పొందాను. అది డిసిల్వా పాఠశాలలో జరిగిన ప్రవచనంలోని చివరి గురువారం. ఆ తరువాత ప్రతి గురువారం జరిగే బాపుగారి ప్రవచనం బాంద్రాలోని న్యూ ఇంగ్లీష్ స్కూల్లో జరగబోతుందని తెలిసింది.
ఆ సమయంలో ఇంట్లో ఉన్న సమస్యల వల్ల నేను చాలా ఆందోళనలో ఉండేదాన్ని. మా పిన్ని అప్పటికే బాపుగారి వద్దకు వెళ్తుండేది, కానీ నాకు అప్పటివరకు ఆయన గురించి ఎలాంటి సమాచారం తెలియదు. బాపుగారి గురించి తెలిసిన తరువాత, ఎన్నో చింతలు, బాధలు ఉండటంతో “మనమూ ఒకసారి బాపుగారి వద్దకు వెళ్లి చూద్దాం” అని అనుకున్నాను.
నేను మొదటిసారిగా డిసిల్వా పాఠశాలలో జరిగిన ప్రవచనానికి వెళ్లినప్పుడు, మనసులోనే బాపుగారితో ఇలా చెప్పుకున్నాను:
“ఇప్పటి నుండి ప్రవచనం బాంద్రాలో జరగబోతోంది. కాబట్టి నాకు అక్కడికి రావడం సాధ్యం కాదు.”
అదే రాత్రి నాకు కలలో బాపుగారు దర్శనమిచ్చారు. ఎలా జరిగిందో నాకు తెలియదు కానీ, అప్పటి నుండి నేను ప్రతి గురువారం బాపుగారి ప్రవచనానికి వెళ్లడం ప్రారంభించాను.
B.Com. లో నాకు 77% వచ్చాయి. ఆ తర్వాత నాకు బ్యాంకింగ్ సెక్టార్లో పని చేయాలని కోరికగా ఉండేది. భండార్కర్ కాళే సి.ఎ. ఫర్మ్లో నాకు బ్యాంక్ Audit లో మంచి అనుభవం వచ్చింది. కానీ బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించిన చాలా పరీక్షలు రాసినా మనసుకు నచ్చిన ఉద్యోగం దొరకడం లేదు. నేను సుచిత్దాదా దగ్గరకు నా ఈ సమస్యను తీసుకుని వెళ్ళాను. ఆయన నన్ను కొన్ని ఉపాసనలు చేయమని చెప్పారు. ఒకటిన్నర సంవత్సరం నేను భండార్కర్ కాళే ఫర్మ్లోనే ఉన్నాను. అక్కడ నాకు చాలా మంచి అనుభవం లభించింది. కాలక్రమేణా నాకు ఎన్.కే.జి.యస్.బి. బ్యాంక్లో ఉద్యోగం వచ్చింది. అక్కడ నేను సగం జీతానికే పని చేశాను. ఆ తర్వాత సరస్వత్ బ్యాంక్లో Officer హోదాలో నా ఎంపిక జరిగింది. కానీ నేను ముంబై వెలుపలికి వెళ్ళడానికి నిరాకరించాను. చివరకు Exim Bank లో నా ఎంపిక జరిగి నన్ను Interview కి పిలిచారు. నేను మనస్ఫూర్తిగా బాపూకి కృతజ్ఞతలు చెప్పుకున్నాను, ఎందుకంటే ఎలాంటి రికమండేషన్ లేకపోయినా, ఆ ఉద్యోగానికి కావాల్సినంత చదువు కూడా లేకపోయినా నన్ను ఎన్నుకున్నారు; అది కూడా వర్ధమాన్ వ్రతాధిరాజ్ నడుస్తున్న రోజుల్లో. వ్రతం చేసి నేను గురువారం నాడు Interview కి వెళ్ళాను. రాత పరీక్ష చాలా బాగా జరిగింది. బ్యాంక్ ఫామ్ నింపేటప్పుడు నేను 'ఇతర’ Activities' లో AADM గురించి రాశాను. దాని గురించే నన్ను ఇంటర్వ్యూలో అడిగారు. ఈ సంధర్భాన్ని ఉపయోగించుకుని నేను వాళ్ళకి మన సంస్థ చేస్తున్న పనులు, అంటే Eco-friendly గణేశ విగ్రహాలు, స్వచ్ఛతా అభియాన్, AADM కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇచ్చాను. కొల్హాపూర్ మెడికల్ క్యాంప్ గురించి కూడా సంక్షిప్తంగా చెప్పాను. వాళ్ళు ఈ Activities అన్నింటినీ మెచ్చుకున్నారు, 'ఈమె అన్ని రంగాల్లోనూ చురుకైనది' అని ఆలోచించి నన్ను ఎంపిక చేసుకున్నారు. నా వర్ధమాన్ వ్రతం చేసిన మొదటి సంవత్సరంలోనే బాపూ నాకు Exim Bank లో ఉద్యోగాన్ని కానుకగా ఇచ్చారు. నా చేత చేయించిన ఉపాసనల ఫలమే ఇది అని నేను నమ్ముతాను.
దీని తర్వాత ఉద్యోగం చూసుకుంటూనే నేను మేనేజ్మెంట్ పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నాను. కానీ పేపర్ అంతగా బాగా రాయలేదు. నేను కేవలం 30 మార్కుల పేపర్ మాత్రమే సరిగ్గా రాశాను. అదే సమయంలో ఒక గురువారం నాడు 10వ, 12వ తరగతి పరీక్షలు రాసే పిల్లలు బాపూ దర్శనానికి వచ్చారు. ఆ సమయంలో నేను కూడా దర్శనం చేసుకున్నాను. బాపూ ఆ రోజు ప్రవచనంలో విద్యార్థులందరినీ ఉద్దేశించి చాలా భరోసా ఇచ్చే మాటలు చెప్పారు. అది విని నేను కూడా నిశ్చింతగా ఉండిపోయాను. రిజల్ట్ వచ్చినప్పుడు మాత్రం నేను ఆశ్చర్యపోయాను. కేవలం 30% పేపర్ మాత్రమే సరిగ్గా రాసినప్పటికీ నాకు 50% మార్కులు వచ్చాయి.
నా పరీక్షలు జరుగుతున్న సమయంలోనే ఒకరోజు మాతృవాత్సల్య ఉపనిషద్ ఆవిష్కరణ వేడుక జరిగింది. బాపూ ఉపనిషత్తు గురించి చెప్పిన విశేషాలు విని, మనం ఈ సువర్ణ మహోత్సవ వేడుకకు సాక్షులుగా ఉన్నందుకు చాలా గర్వంగా అనిపించింది. ఆ రోజు రాత్రి కూడా కేవలం 50% చదవడం మాత్రమే అయింది. మరుసటి రోజు నేను చదివిన ప్రశ్నలే వచ్చాయి, నేను పరీక్షలో పాస్ అయ్యాను. ఇదే నా బాపూ మహిమ! అత్యంత ప్రతికూల పరిస్థితిలో కూడా బాపూనే నా చేత ఉద్యోగం, చదువు రెండూ చేయించారు. బాపూనే నా పూర్తి కుటుంబ భారాన్ని మోశారు. మా అమ్మగారికి కూడా సరైన చోటికి బదిలీ అయింది, మా సోదరుడికి కూడా ఉద్యోగం వచ్చింది. బాపు మమ్మల్ని ఎప్పటికప్పుడు ఎంతో ప్రేమగా, జాగ్రత్తగా కాపాడుతూ వచ్చారు.
నేను మా తాతయ్యకు సంబంధించిన ఒక అనుభవాన్ని అందరికీ ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను. ఆయన మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండేవారు. ఆయనకు 85 ఏళ్లు ఉన్నప్పుడు Prostate Cancer ఉన్నట్లు తేలింది. ఆయన పూర్తిగా మంచానికే పరిమితమైపోయారు. ఒక శనివారం మా పిన్ని ఫోన్ చేసి తాతయ్య నొప్పితో విలవిలలాడుతున్నారని చెప్పింది. నేను వెంటనే సుచిత్దాదా దగ్గరకు వెళ్ళాను. డాక్టర్ శివానందసింహ్ ఫైల్ చూడగానే చెప్పారు, "ఇది నాల్గవ Stage క్యాన్సర్, నయం కావడం కష్టం" అని. అప్పుడు నేను సుచిత్దాదాకు నా ఒకే ఒక్క కోరికను చెప్పాను, చివరి క్షణంలో తాతయ్యకు ఎలాంటి నొప్పీ తెలియకూడదు అని. దాదా మమ్మల్ని తాతయ్య కోసం రామరక్షా స్తోత్రం చదవమని చెప్పారు. బాపూ ఇక్కడ కూడా మా తాతయ్యను కనిపెట్టుకుని ఉన్నారు, మరుసటి రోజే మా పిన్ని ఫోన్ చేసి అణ్ణా (తాతయ్య) నొప్పులు పూర్తిగా తగ్గిపోయాయని చెప్పింది. ఆయన మంచంలోనే ఉన్నప్పటికీ చాలా ప్రశాంతంగా, బాగున్నారు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత తాతయ్య ఎలాంటి నొప్పీ లేకుండా కన్నుమూశారు.
ఆ తర్వాత ఒకసారి బాపూ నా కలలోకి వచ్చారు, నేను చూస్తే ఆయన ముఖమంతా పూర్తిగా గాయాలతో నిండి ఉంది. తాతయ్య అనుభవించాల్సిన కర్మల భోగాన్ని బాపూ తనపైనే వేసుకున్నారని నేను నమ్ముతాను. మన కోసం బాపూ ఎంత బాధ అనుభవిస్తారో కదా! తాతయ్య చివరి క్షణాల్లో బాపూ ఆయన్ని ఒక చిన్న బిడ్డలాగా చూసుకున్నారు.
నేను ఇంకొక అనుభవం చెప్పాలనుకుంటున్నాను. అది శ్రీగురుక్షేత్రం గురించి. శ్రీ అనిరుద్ధ గురుక్షేత్రంలో ఆదిమాతకు చేసిన ప్రార్థన ఎప్పటికీ వృథా పోదు. మా అమ్మకు Spondylitis సమస్య మొదలైంది. ఆమెను ములుండ్లోని ఆసుపత్రిలో చేర్పించి Traction మొదలుపెట్టారు. ఆ తర్వాత ఒక నెల రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోమన్నారు. నేను చాలా భయపడిపోయాను, మా అమ్మ ఇక ఎప్పటికీ కోలుకోదేమో అనుకున్నాను. నేను గురుక్షేత్రంలో ఆదిమాతకు, త్రివిక్రముడికి ప్రార్థన చేశాను.
ఆ తర్వాత ఇంటికి వచ్చాక అక్కడ కనిపించిన దృశ్యం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇంటి తలుపుకు పూలదండ వేసి ఉంది. అమ్మను దీని గురించి అడగ్గా, ఆమె ఇలా అంది, "నీ పిన్ని పుట్టినరోజు సందర్భంగా ఆమె పుష్పసేవ తీసుకుంది, అందుకే నేను ఆమెతో కలిసి గురుక్షేత్రానికి వెళ్ళి వచ్చాను. అక్కడ ప్రసాదంగా ఇచ్చిన దండను మన తలుపుకు తగిలించాను." మా అమ్మ అలా కోలుకోవడం చూసి నేను అవాక్కైపోయాను. నేను ఆదిమాతను పట్టుబట్టి ప్రార్థించడమేమిటి, వెంటనే అమ్మ నడుచుకుంటూ గురుక్షేత్రానికి వెళ్ళడమేమిటి! ఇదంతా నా ఊహకు అందకుండా ఉంది. ఆదిమాతకు, బాపూకు మనపై ఎంత ప్రేమ, జాలి! నాకు తెలియకుండానే ఆదిమాత నాకు చాలా పెద్ద బహుమతిని ఇచ్చింది.
నా ఒక స్నేహితురాలు సంతానం లేకపోవడం వల్ల చాలా నిరాశలో ఉండేది. ఒకసారి ఆమె నా డెస్క్పై ఉన్న బాపు ఫోటోను చూసింది. అప్పుడు ఆమె బాపు గురించి అడిగింది.
నేను ఆమెకు బాపు గురించి వివరించాను. అదే సమయంలో గణేశోత్సవం సమీపిస్తుండటంతో, బాపు ఇంట్లో జరిగే గణపతి ఉత్సవం గురించి మరియు బాపు సూచించిన సంకల్ప సుపారీ గురించి కూడా చెప్పాను.
ఆమె అప్పటివరకు ఎన్నో దేవాలయాలు తిరిగి, ఎన్నో ప్రార్థనలు చేసింది. అప్పుడు నేను ఆమెతో ఇలా చెప్పాను:
"నీకు నమ్మకం ఉంటే, నువ్వు బాపు దర్శనానికి వచ్చి సంకల్ప సుపారీ తీసుకుని సంకల్పం చేయి. బాపు తప్పకుండా నీకు సహాయం చేస్తారు."
ఆమె నేను చెప్పినట్లే చేసింది. ఆశ్చర్యకరంగా, అదే సంవత్సరంలో ఆమెకు ఒక అందమైన బిడ్డ జన్మించింది.
మొదటిసారిగా గణేశోత్సవానికి వచ్చిన నా స్నేహితురాలి మనోకామన కూడా బాపు కృపతో నెరవేరింది.
ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, సమస్యలు తప్పకుండా వస్తాయి. కానీ మన డ్యాడ్ సరైన మార్గదర్శనం చేసి ప్రతి భక్తుడిని వాటి నుండి ఎంతో సులభంగా బయటకు తీసుకువస్తారు. ఈ విషయాన్ని నేను మరియు నా కుటుంబ సభ్యులందరం సంపూర్ణ విశ్వాసంతో అందరికీ చెబుతున్నాము.
నేను అంబజ్ఞురాలిని.
హరి ఓం
నాథసంవిధ్
| Hindi | English |
|---|---|
Comments
Post a Comment